VSP: తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛైర్మన్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.