సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ట్యాంక్ సర్కిల్ వద్ద రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, స్లాబ్ కల్వర్ట్, డ్రైన్ల నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.