TPT: సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీరు, కరెంట్, రోడ్లు, రెవెన్యూ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.