ప్రకాశం: సింగరాయకొండ (మం) కలికివాయలో టీడీపీ సీనియర్ నాయకులు గాంధీ చౌదరిని మంత్రి డోలా శనివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కాలంలో అయినా అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. ఈ మేరకు గాంధీ ఆరోగ్య పరిస్థితుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మంత్రి డాక్టర్ కావడంతో కొన్ని సలహాలు సూచనలు చేశారు.