AKP: ఎస్ రాయవరం మండలం సోమిదేవుపల్లి వద్ద వరాహ నది గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. రక్ష గోడ నిర్మాణానికి రూ.9.95 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన కోతకు గురైన వరాహనది గట్టును పరిశీలించారు. రక్షణ గోడ, గ్రోయిన్, రెండు మదుముల నిర్మిస్తామన్నారు.