SRCL: జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారి కోసం ‘రహ్ వీర్’ (Rah-Veer) పథకాన్ని ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద సమయాల్లో గాయపడిన వారికి తక్షణ సాయం అందించి ప్రాణాలు కాపాడే బాధ్యతగల పౌరులకు రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని వెల్లడించారు.