WGL: గీసుగొండ మండలం కొనయమాకుల గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (KUDA) ఛైర్మన్ వెంకటరామిరెడ్డి సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్పంచ్ పీసల రాజు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. గ్రామస్థాయిలో ప్రతి సమస్యకు పరిష్కారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామసభ’లను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.