SDPT: పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి వేద స్వస్తితో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయినాథుని దర్శించుకున్న అనంతరం భక్తులు మందిరంలో ధ్యానం చేశారు. ట్రస్ట్ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.