PLD: ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై ఉన్న దాచేపల్లి బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. బస్టాండ్ నిర్మించి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పూర్తిస్థాయి ఉపయోగంలోకి రాలేదు. బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డుమీద ఎండకు ఎండుతూ బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.