BHPL: చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు దళారుల మాటలను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు.