AP: రాజధాని అమరావతిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కి.మీ ప్రాంతాన్ని క్యాపిటల్ ఏరియా కారిడార్గా ప్రకటించాలన్నారు. దీనికి ‘మావిగన్’ అని పేరు పెట్టాలన్నారు. ఇది భవిష్యత్తులో గ్రోత్ ఇంజిన్ అవుతుందని, ఈ మూడు ప్రాంతాల్లో(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) దాదాపు 40 లక్షల జనాభా ఉందని పేర్కొన్నారు. కాస్త ఖర్చు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.