• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు మెగా జాబ్ మేళా

NZB: గిరిరాజ్ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జి, కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. టెక్ మహీంద్రా, మత్తూట్, జస్ట్ డైల్, టాటాఏఐజీ, మొదలైన కంపెనీలు ఇందులో పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల యువత జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.

March 15, 2026 / 11:02 AM IST

‘కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పండి’

ADB: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ నిధుల ద్వారా చెల్లించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు.

March 15, 2026 / 11:00 AM IST

‘సొంతింటి కల సాకారం చేస్తూన్న ఇందిరమ్మ ఇళ్లు’

ASF: కాగజ్ నగర్ పట్టణం కాపువాడలో లబ్ధిదారుడు తిరుపతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి MLC విఠల్ ఆదివారం హాజరయ్యారు. నూతన దంపతులకు బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.

March 15, 2026 / 10:59 AM IST

నగరంలో బుల్డోజర్ల రాజ్యం: హరీష్ రావు

HYD: ముషీరాబాద్ భోలక్‌పూర్‌లోని అంజుమన్ గర్ల్స్ హై స్కూల్లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో BRS ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. నగరంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి, బస్తీ దవఖాన వంటివి కూడా అమలు చేయలేకపోతున్నాయని విమర్శించారు.

March 15, 2026 / 10:53 AM IST

మరిపెడ పట్టణ అభివృద్ధికి సహకరించాలి: ఛైర్ పర్సన్

MHBD: మరిపెడ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ 11, 13వ వార్డులలో ఛైర్ పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తూ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

March 15, 2026 / 10:52 AM IST

బైక్ చోరీ కేసును చేదించిన పోలీసులు

MHBD: గాలివారిగూడెంలోని ANR గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం జరిగిన బైక్ చోరీ కేసును SI వీరభద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు చేదించారు. పోలీసుల తనిఖీలు చేపట్టగా.. కార్గిల్ సెంటర్ వద్ద నిందితులు గోపీచంద్, మనోజ్‌ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 బైకులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

March 15, 2026 / 10:51 AM IST

అనుమానాస్పద స్థితిలో యువ వైద్యుడు మృతి

WGL: జిల్లాలో విషాదం నెలకొంది. నర్సంపేట పట్టణంలోని శశి ఆసుపత్రి వైద్యుడు డా.శశిధర్ రెడ్డి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చని తోటి వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంబంధించి కారణాలపై స్పష్టత లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 10:51 AM IST

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన

PDPL: రామగుండం 50వ డివిజన్ అశోక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలు జరిగాయి. 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్, 59వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని తిరుపతి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించి, అక్షరాభ్యాసం ప్రారంభించిన సతీష్ మాట్లాడుతూ.. బాల్యంలోనే మంచి ఆహారం, అందుతుందన్నారు.

March 15, 2026 / 10:50 AM IST

‘ఆకేరు వాగుపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి’

KMM: ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద నిరసన చేపట్టారు. 2024లో వచ్చిన వరద విపత్తుకు బ్రిడ్జికూలిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు.

March 15, 2026 / 10:50 AM IST

‘ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం సర్పంచ్ యాంజాల స్వామి ఆధ్వర్యంలో యువత స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. యావపూర్ గ్రామంలోని 9వ వార్డులో వీధులను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. యావపూర్ గ్రామంలో ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను లేకుండా చూసుకోవాలని సూచించారు.

March 15, 2026 / 10:49 AM IST

‘ఇళ్ల కేటాయింపులో అవకతవకలకు ఆస్కారం లేదు’

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలకు ఎలాంటి ఆస్కారం లేదని తహాసీల్దార్ కృష్ణ తెలిపారు. ఇప్పటికే 491 మంది అర్హుల జాబితాను విడుదల చేశామని, డ్రాతో 108 మంది లబ్ధిదారులను నిర్ణయిస్తామన్నారు. ఇందులో పైరవీలు ఉండవు. ప్రక్రియ అంతా పారదర్శకంగా కొనసాగిస్తామని తెలిపారు. దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

March 15, 2026 / 10:48 AM IST

జహీరాబాద్‌లో గ్యాస్ గోదాం తనిఖీ

SRD: జహీరాబాద్ పట్టణంలో గ్యాస్ కొరత ఉందన్న వార్తలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్ ఆధ్వర్యంలో గ్యాస్ గోదాంను పరిశీలించారు. గోదాంలో సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధీర్ బండారి, కౌన్సిలర్ పాల్గొన్నారు.

March 15, 2026 / 10:47 AM IST

ఈనెల 23న తై బజార్ వేలం పాట

NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 23న తై బజార్, చికెన్ వేస్ట్ సేకరణ, జంతు వధశాల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమిషనర్ నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఆసక్తి గల వారు ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తై బజార్, చికెన్ వేస్ట్ టెండర్ కోసం రూ.5 లక్షలు, జంతు వధశాల కోసం రూ.40,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

March 15, 2026 / 10:46 AM IST

రోడ్డుపై కంకర వేసి వదిలేశారు..!

GDWL: ఇటిక్యాల మండలం ఉదండాపురం నుంచి మల్దకల్ వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతల మరమ్మతుల కోసం కంకర వేసిన అధికారులు, నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయకుండా వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. కంకర తేలి ఉండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 15, 2026 / 10:45 AM IST

అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం వేసిన మహిళపై కేసు: ఎస్సై

WNP: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక పోవడంతో ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసిన మహిళపై కేసు నమోదు చేశామని రేవల్లి ఎస్సై రజిత తెలిపారు. డబ్బు ఇవ్వమని కోరిన శివలీల కొంత సమయ మిస్తే ఇస్తానని భాస్కర్ చెప్పగా వినకుండా ఇంటికి తాళం వేసి దూషించింది. బాధితుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటికి తాళం వేసిన మహిళపై పోలీసులు కసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 15, 2026 / 10:45 AM IST