PDPL: వెల్ఫేర్ వీక్ (ఏప్రిల్ 20–26)లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా అధికారి రమేశ్ కుమార్ నాయుడు తెలిపారు. వారం పొడవున మహిళలకు కుట్టు యంత్రాలు, యువతకు నైపుణ్య శిక్షణ, కెరీర్ మార్గదర్శనం, విద్యార్థులకు పేరెంట్-టీచర్ సమావేశాలు, అర్హులకు ఆర్థిక సహాయం, ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
VKB: పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఉప సర్పంచ్ మోహిద్ ప్రవర్తనపై వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న జరిగిన గ్రామసభలో సర్పంచ్ స్థానంలో వ్యవహరించడం, వార్డు సభ్యులను అవమానించడం, సభ నుంచి వెళ్లిపోవాలని చెప్పడం వంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో ఎం.కామ్. విద్యార్థుల కోసం “పరిశోధన పద్ధతి, ప్రాజెక్ట్ వర్క్” పై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. వీసీ ప్రొ.జీ.ఎన్.శ్రీనివాస్ పరిశోధన ప్రాముఖ్యతను వివరించగా, రిజిస్ట్రార్ ప్రొ. రమేష్ బాబు నాణ్యమైన పరిశోధన అవసరాన్ని చెప్పారు. ప్రధాన వక్త ప్రశాంత ఆత్మ పరిశోధనా విధానాలను సులభంగా వివరించారు.
జగిత్యాల జిల్లాతో KCRకు సుదీర్ఘమైన, విడదీయలేని అనుబంధం ఉంది. 2009లో ‘సింహగర్జన’ను జగిత్యాల నుంచే ప్రారంభించారు. కాగా ‘జగిత్యాల నా రాజకీయ జన్మభూమి’ అని అనేకసార్లు KCR బహిరంగ సభల్లో అన్నారు. అయితే ఇవాళ కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
MDCL: చంద్రపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సుదర్శన, నారసింహ హోమం, లక్ష్మీనారాయణ తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుదర్శన–నారసింహ హోమం లోక కళ్యాణానికి దోహదపడుతూ, శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆరోగ్య సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత, సానుకూలత పెరగుతుందన్నారు.
RR: షాబాద్ చౌరస్తాలో డివైడర్ మధ్య ఉన్న నిరుపయోగమైన బాక్స్ ఇబ్బందిగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. బాక్స్ వల్ల HYD నుంచి వచ్చే వాహనాలు కనిపించక యూ-టర్న్ తీసుకునేవారు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి బాక్స్ను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరారు.
WGL: నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట రోడ్డులో గల రాయ్ ఫిట్నెస్ స్టూడియో మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ఫిట్నెస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా TPCC సభ్యులు పెండెం రామానంద్ పాల్గొని విజేతలకు నగదు, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా పాత్రికేయులకు మే 1వ తేదీ నుంచి అక్రిడిటేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ హరిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
SRCL: పుస్తెళతాడు, ఫోన్ చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చందుర్తి ఎస్సై రమేష్ సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో భైరగోని అనిత అనే మహిళకు చెందిన 2.5 తులాల పుస్తెలా తాడు, సెల్ఫోన్ను గత సెప్టెంబర్ 24న గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడి పుస్తెలు, ఫోను ఎత్తుకెళ్లినట్లు పిర్యాదు చేసింది.
KMM: నెలవారీ చందా ఇవ్వలేదన్న కారణంతో తమను కుల బహిష్కరణకు గురిచేశారని మధిర మండలం ఆత్కూరు గ్రామ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ. 50 చందా కట్టలేదని తమ ఇళ్లకు ఎవరూ వెళ్లకూడదని, వెళ్తే రూ. 20 వేల జరిమానా విధిస్తామని గ్రామంలోని కొందరు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజకు వారు ఫిర్యాదు చేశారు.
KMR: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ హరిత చెప్పారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలనే సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట గౌడ్ నాయకులు ఉన్నారు.
MHBD: పెద్ద గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో TDP నేతలు ఉన్నారు.
KMM: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వర్ణ సుబ్బారావు అన్నారు. ఓటీపీ పేరుతో షరతులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే ఆ నిబంధనలను రద్దు చేయాలని సోమవారం కలెక్టరేట్లో రైతులతో కలిసి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
KNR: మానకొండూరు రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రజావాణిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు కార్యాలయంలో ప్రతి సోమవారం మండల పరిధిలోని ఆర్జీదారుల నుంచి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
MLG: మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మంగపేట (M)లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు, మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.