• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భద్రాద్రి జిల్లాలో ‘టైగర్ భద్ర’ సంచారం

BDK: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా కొద్దిరోజులకే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఎ కృష్ణాగౌడ్ తెలిపారు.

February 6, 2025 / 08:04 AM IST

కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్​ అలీ

KMR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అవకతవకలపై సీఐడీ విచారణ చేయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో సమగ్ర కుటుంబ సర్వే లేదా ఐహెచ్ఎస్ 2014 పేరుతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో సహా వివిధ కుటుంబాలకు సంబంధించి తెలిపారు.

February 5, 2025 / 07:33 PM IST

జిల్లా అధ్యక్షున్ని కలిసిన మండల నాయకులు

NZB: ఇటీవల నిజామాబాద్ జిల్లా BJP జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దినేష్ కులచారిని NZB జిల్లా కార్యాలయంలో బుధవారం ముగ్పాల్ బీజేపీ నాయకులు కలిశారు. అనంతరం ఆయను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్పాల్ మండల నాయకులు మాట్లాడుతూ.. రెండోసారి ఏకగ్రీవంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం హర్షనీయమన్నారు.

February 5, 2025 / 07:09 PM IST

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 5, 2025 / 06:49 PM IST

కాలేశ్వరం ఆలయంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం

PDPL: కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు, కాలేశ్వరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణింద్ర శర్మ అన్నారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి కరకమలములతో శతచండీ మహారుద్ర సహిత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

February 5, 2025 / 06:49 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మార్వో

NZB: ముప్కాల్ మండల నూతన ఎమ్మార్వో గజానన్ను మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘం సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మార్వో మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయం సిబ్బంది, రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 5, 2025 / 06:29 PM IST

సుల్తానాబాద్ మండల తాహసీల్దార్‌గా రామచంద్ర రావు బాధ్యతల స్వీకరణ

PDPL: సుల్తానాబాద్ మండల నూతన తహశీసీల్దార్‌గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా మండల ప్రజలు సహకరించాలని కోరారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

February 5, 2025 / 06:24 PM IST

బీజేపీ మండలాధ్యక్షుల నియామకం

కామారెడ్డి: బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను బుధవారం నియమించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాలకు నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. 

February 5, 2025 / 05:58 PM IST

పాఠశాల గ్రంథాలయాన్ని సందర్శించిన ఛైర్మన్

NZB: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజ రెడ్డి, తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఛైర్మన్ హామి ఇచ్చారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ బి.సీతయ్యను ఇరువురు అభినందించారు.

February 5, 2025 / 03:47 PM IST

నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

NZB: నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ బుధవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను సీఐ రవీందర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి పద్ధతుల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.

February 5, 2025 / 03:42 PM IST

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

KMM: తల్లాడ మండల మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు చలో హైదరాబాద్‌కు బయలుదేరగా తల్లాడ మండల పరిధిలో ఉన్న సర్పంచులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం మండల కార్యదర్శి అన్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసి 13 నెలలు అయినా నేటికి బిల్లులు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు.

February 5, 2025 / 02:20 PM IST

కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం

SRPT:  BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది.

February 5, 2025 / 02:11 PM IST

‘చిన్న పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయాలి’

BDK: ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని పినపాక పీహెచ్సి వైద్యురాలు దుర్గ భవాని అన్నారు. బుధవారం ఆమె పోతిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, టీకా వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం ప్రతినెల వైద్య సిబ్బంది బాలింతలను గుర్తించి టీకా వేసే విధంగా కృషి చేయాలని అన్నారు.

February 5, 2025 / 01:45 PM IST

బస్ డిపో ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

KMR: ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు.. మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రిని కలిసినట్లు వివరించారు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 ఏళ్ల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిందని ఎమ్మెల్యే తెలిపారు.

February 5, 2025 / 01:40 PM IST

రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: బీఆర్ఎస్

SDPT:  చేర్యాల మండలం ముస్త్యాల్లో బుధవారం BRS చేర్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మంగోలు చంటి, మేడిశెట్టి శ్రీధర్, ఎల్లారెడ్డి, ఆకుల రాజేష్ సీనియర్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

February 5, 2025 / 01:27 PM IST