• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఐ కిషన్‌కు వినతి పత్రం అందించిన గ్రామస్తులు

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ రాంపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేసేలా చేపట్టే ఉద్యమానికి సహకరించాలని కోరుతూ మడికొండ సీఐ పీ.కిషన్‌కు పలు గ్రామాల ప్రజలు వినతి పత్రం అందజేశారు. రాంపురం, మడికొండ గ్రామాల ప్రజలు నేడు సీఐని కలిసి సమస్య తీవ్రతను వివరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

February 6, 2025 / 03:52 PM IST

కాంగ్రెస్ నుంచి మహిళా రెబల్ నామినేషన్

KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా అదిలాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ మంచికట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టరేట్లో గురువారం సమర్పించారు. తాను 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రెబల్‌గా నామినేషన్ వేసినట్లు తెలిపారు. 

February 6, 2025 / 02:16 PM IST

రాజన్న సేవలో జబర్దస్త్ నటులు

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకొని సేవలో తరించారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. అందరిపై స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.

February 6, 2025 / 02:11 PM IST

అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులు

PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన జాపతి రాజయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు నేత్రదానం చేశారు. లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోహైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు దేవక్క, శ్రీనివాస్, శేఖర్, రమ, పాల్గొన్నారు.

February 6, 2025 / 01:57 PM IST

“కాంగ్రెస్ పార్టీతోనే నిరుద్యోగ సమస్యలు తీరుతాయి’

SRCL: కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ, నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో గల కళాశాల మైదానం బతుకమ్మ ఘాట్, కార్గిల్ లేక్, ఇంద్ర పార్క్, రాజీవ్ నగర్ స్టేడియం వాకర్స్‌తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

February 6, 2025 / 01:49 PM IST

తప్పుడు ఆపిడవిట్లతో దరఖాస్తు చేసిన ఇద్దరు అరెస్టు

PDPL: తప్పుడు అఫిడవిట్లతో పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తమపై ఎలాంటి కేసులు లేవంటూ దరఖాస్తు చేసుకున్న విజయ్, రాజేశ్ కుమార్లపై ఎస్‌బీ అధికారులు వెరిఫికేషన్ చేసి క్రిమినల్ కేసులు ఉన్నట్లు నిర్ధారించామన్నారు.

February 6, 2025 / 01:34 PM IST

బీసీ సాధికారిక సంఘం అధ్యక్షులు ఎన్నిక

SRCL: చందుర్తి మండల బీసీ సాధికారిత సంఘం మండల అధ్యక్షులుగా ముద్ర కోల వెంకన్న నియామకమయ్యారు. ఈ మేరకు వేములవాడలో గురువారం జరిగిన సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు కొండ దేవయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్‌లు వెంకన్నకు నియామక పత్రం అందజేశారు. బీసీల హక్కుల కోసం పోరాడనున్నట్టు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకన్నకు అభినందనలు తెలిపారు.

February 6, 2025 / 01:25 PM IST

‘పనులను త్వరగా పూర్తి చేయాలి’

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఇన్‌ఛార్జి అధికారి ఇమ్మానియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

February 6, 2025 / 09:10 AM IST

బోనస్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న రైతులు

ADB: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వానాకాలం సీజనుకు సంబంధించి అమ్మిన ధాన్యానికి బోనస్ డబ్బులను బ్యాంకు ఖాతాలలో వేయాలని రైతులు కోరారు. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ను ఇస్తామని ప్రకటించింది. ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్న తమకు బోనస్ డబ్బులు రాలేదని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు వాపోయారు.

February 6, 2025 / 08:56 AM IST

మరికొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు అనుమతి

KMM: జిల్లాలోని వైరా, బోనకల్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. గత నెల 31వ తేదీతో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని అధికారులు ప్రకటించారు. అయితే, వైరా, సిరిపురం, ఉప్పలమడక, బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో ఇంకా ధాన్యం మిగలగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం అనుమతి జారీచేయగా ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.

February 6, 2025 / 08:41 AM IST

దత్తాచల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

SRD: మాఘమాసం మొదటి గురువారం పురస్కరించుకొని హత్నూర మండలం మధురలోని దత్త చల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దత్త నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

February 6, 2025 / 08:25 AM IST

భద్రాద్రి జిల్లాలో ‘టైగర్ భద్ర’ సంచారం

BDK: జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నా కొద్దిరోజులకే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్ఎ కృష్ణాగౌడ్ తెలిపారు.

February 6, 2025 / 08:04 AM IST

కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి: షబ్బీర్​ అలీ

KMR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అవకతవకలపై సీఐడీ విచారణ చేయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో సమగ్ర కుటుంబ సర్వే లేదా ఐహెచ్ఎస్ 2014 పేరుతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో సహా వివిధ కుటుంబాలకు సంబంధించి తెలిపారు.

February 5, 2025 / 07:33 PM IST

జిల్లా అధ్యక్షున్ని కలిసిన మండల నాయకులు

NZB: ఇటీవల నిజామాబాద్ జిల్లా BJP జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దినేష్ కులచారిని NZB జిల్లా కార్యాలయంలో బుధవారం ముగ్పాల్ బీజేపీ నాయకులు కలిశారు. అనంతరం ఆయను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్పాల్ మండల నాయకులు మాట్లాడుతూ.. రెండోసారి ఏకగ్రీవంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం హర్షనీయమన్నారు.

February 5, 2025 / 07:09 PM IST

బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 5, 2025 / 06:49 PM IST