• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తుక్కాపూర్‌లో బీజేపీ నాయకుల నిరసన

SDPT: మరమ్మతుల పేరుతో తొగుట మండలం కాన్గల్, తుక్కాపూర్ గ్రామాలకు సప్లై అయ్యే ట్రాన్స్ఫార్మర్లను తుక్కాపూర్ సబ్స్ స్టేషన్  నుంచి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకొని కాన్గల్, తుక్కాపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. రైతుల నిరసనకు బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతుల, నాయకుల ఆందోళనలతో ట్రాన్స్ ఫార్మర్ల  తరలింపుకు వాహనాలను అధికారులు తిరిగి రోడ్డుపైకి పంపించారు.

February 5, 2025 / 01:24 PM IST

అభిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్యర్యంలో నిరసన

KMM: కేంద్ర బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ రంగాలకు రూ. 2లక్షల కోట్లు కేటాయింపులు చేయాలని కోరుతూ అభిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్యర్యంలో బుధవారం ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సంధర్బంగా బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

February 5, 2025 / 01:18 PM IST

మార్కెట్లో నేటి కూరగాయల ధరలు

KMM: ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (VDO’Sకాలనీ)లో బుధవారం కూరగాయల ధరలు.. KG టమాటా రూ. 16, వంకాయ 34,బెండకాయ 48, పచ్చిమిర్చి 24, కాకర 48, కంచకాకర 54, బీరకాయ 48, సొరకాయ 18, దొండకాయ 34, నాటు చిక్కుడు 80, క్యాబేజీ 20, ఆలుగడ్డ 30, చామగడ్డ 48, క్యారెట్ 28, బీట్రూట్ 28, ఉల్లిగడ్డలు 40, కోడిగుడ్లు (12) రూ.70గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.

February 5, 2025 / 12:54 PM IST

బాధిత కుటుంబానికి రూ.2.25 లక్షల ఎల్ఓసి అందజేత

SDPT: దూల్మిట్ట మండలం వీర బైరాన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పరి రాజేశ్వరికి అరుదైన వ్యాధి పాలిఆర్టికులర్ జువైనల్(ఎదుగుదల లోపించడం)తో బాధపడుతుంది. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.2.25 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి నేడు అందజేశారు.

February 5, 2025 / 12:28 PM IST

తాండూర్ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

మెదక్: తాండూర్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లికి చెందిన నర్సింలు భార్య రాజేశ్వరి గర్భందాల్చింది. పురిటినొప్పులు రాగా కుటుంబీకులు మాతా, శిశు ఆసుపత్రికి తరలించగా వైద్యులు కాన్పు చేశారు. మగ శిశువు పుట్టినా కాన్పులోనే చనిపోయాడు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లితండ్రులు ఆరోపించారు.

February 5, 2025 / 12:17 PM IST

శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి: శైలి బెల్లాల్

NZB: కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాలయువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశంఉంటుందని, శిక్షణలోపాల్గొనే ఆసక్తి ఉన్నవారు NYKలో సంప్రదించాలన్నారు.

February 5, 2025 / 11:19 AM IST

నేడు విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సమావేశం

MDK: విద్యుత్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఈ శంకర్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమల యజమానులు, రైతులు హాజరుకావాలని కోరారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అవసరాల కోసం సుమారు రూ.35.09 కోట్లతో ప్రణాళికలను రూపొందించిందన్నారు.

February 5, 2025 / 10:47 AM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

HYD: హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇవాళ ఉ.5:30 నిమిషాలకు బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. అయితే దీనిపై చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారట. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

February 5, 2025 / 09:47 AM IST

జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేత

BNR: తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమాఖ్య భువనగిరి జిల్లా కమిటీని నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లెపాక వెంకన్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధ్యక్షులు మహేష్,ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి సురేష్‌ నియమించారు. ఈ సందర్భంగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ వారికి ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.

February 5, 2025 / 09:02 AM IST

ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలకు ఆహ్వానం

HYD: హైదరాబాద్ పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఉద్యోగాల పార్టీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి 382 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. టెన్త్ పాసై వయసు 18-24 సంవత్సరాలు ఉన్నవారు ఫిబ్రవరి 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆశక్తి గలవారు iocl.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 5, 2025 / 08:57 AM IST

ఎస్సీ కులాల వర్గీకరణతో ఉప కులాలకు సంపూర్ణ న్యాయం

NZB: గాంధారి మాదిగ ఉప కులాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించడం హర్షనీయమని మాజీ టీఎన్జీవోస్ కార్యదర్శి సాయిలు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మాదిగ వారికి వర్గీకరణతో ఉప కులాలకు సంపూర్ణ న్యాయం జరిగిందని తెలిపారు. మాదిగ ఉప కులాలకు కావాలసిన రిజర్వేషన్లు వచ్చాయని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేసిన పోరాటానికి ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.

February 5, 2025 / 07:45 AM IST

ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ

MDK: వివాహ శుభకార్యాలు, పుణ్య క్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13, 200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14, 700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

February 5, 2025 / 07:41 AM IST

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర: ఏసీపీ కృష్ణ

PDPL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనగర్తి గ్రామంలో ప్రజల సహకారంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏసీపీ గజ్జి కృష్ణ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై దీకొండ రమేష్, గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు.

February 5, 2025 / 07:38 AM IST

‘3 రోజులు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలి’

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో చికెన్, మటన్ విక్రయాలు చేయవద్దని బజరంగ్ దళ్ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని దాభాలు, వైన్ షాప్‌ల నిర్వాహకులు మూడు రోజుల వరకు విక్రయాలు చేయకుండా తమకు సహకరించాలని కోరారు.

February 5, 2025 / 06:34 AM IST

దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ఋణాలు

JGL: జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి, పునారావాస పథకంలో భాగంగా జీవనోపాధి పొందుటకు సబ్సిడీ ఋణాలు అందజేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు లింకేజి లేకుండా దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.50,000 ల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కావున అర్హులైన దివ్యాంగులు ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసు‌కోవాలని అన్నారు.

February 5, 2025 / 05:28 AM IST