• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నూర్జహాన్ ఆశయ సాధనే మా లక్ష్యం: ఎన్పీఆర్డీ

NZB: సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మృతికి సంతాపంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ పట్టణం రాకసిపేట్లో సంతాప సభనిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్య దర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, వికలాంగుల హక్కుల కోసం నూర్జహాన్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.

April 23, 2026 / 09:30 PM IST

‘తీవ్రమైన ఎండలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

BDK: జిల్లా వ్యాప్తంగా నేడు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని పినపాక మండలం ఈ. బయ్యారంలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. లక్ష్మీదేవిపల్లిలో 43.8°C, భద్రాచలంలో 43.7°C, చర్లలో 43.6°Cగా రికార్డయింది. జిల్లాలోని పలు మండలాల్లో 40°C నుంచి 44°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

April 23, 2026 / 09:29 PM IST

ఎదురెదురుగా ఢీకొన్న బైక్ లు.. ఇద్దరికి గాయాలు

మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం సీరోలు మండలానికి చెందిన గునిగంటి వంశీ(23), జార్ఖండ్‌కు చెందిన సుధాకర్ (52)ల బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.

April 23, 2026 / 09:15 PM IST

డీటీపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం

BDK: పినపాక మండలంలోని గోపాలరావుపేటలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సివిల్ సప్లై డీటీ శివకుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

April 23, 2026 / 09:06 PM IST

చట్టాన్ని అతిక్రమించే చర్యలు తప్పవు: ఎస్పీ

SRD: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం సంగారెడ్డి బస్ డిపోను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమ్మె కాలంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 23, 2026 / 09:01 PM IST

‘భగీరథ మహర్షి సంకల్పం నేటి తరానికి ఆదర్శం’

KNR: శ్రీ సగర భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఉన్నతాధికారులు సగర సంఘం నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

April 23, 2026 / 09:00 PM IST

ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా శ్రీధర్

PDPL: ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా జి.శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పనా, సంజీవయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా పురోగతికి కృషి చేస్తానని తెలిపారు. నూతన ప్రిన్సిపల్‌కు సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

April 23, 2026 / 09:00 PM IST

అల్వాల్‌లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పట్టివేత

MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హస్మత్‌పేట్ అంజయ్య నగర్ వద్ద తనిఖీల్లో భాగంగా వాహనంలో ఉన్న 69 ఇండియన్ గ్యాస్ సిలిండర్లను (14 నింపినవి, 55 ఖాళీ) స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనిల్ సావన్, అనిల్ కిలేర్‌లపై కేసు నమోదు చేసి ఒక బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.

April 23, 2026 / 09:00 PM IST

అమ్మ చాటున ఉండాల్సిన బిడ్డ.. అనాథగా మూత్రశాలలో..

SRCL: సిరిసిల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలోని మూత్రశాలలో పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మూత్రశాల నుంచి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడ ఉన్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాపను రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

April 23, 2026 / 09:00 PM IST

గ్రంథాలయాన్ని సందర్శించిన SC,ST కమిషన్ సభ్యులు

MNCL: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణం గ్రంథాలయాన్ని రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. కాంపిటేటివ్ పుస్తకాలను అందజేస్తానని పేర్కొన్నారు.

April 23, 2026 / 09:00 PM IST

ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారి

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. అనుమతి లేని 2 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆప్టికల్ దుకాణాలు కంటి పరీక్షలు నిర్వహించరాదన్నారు. వైద్యానికి సంబంధించిన అన్నింటికీ ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

April 23, 2026 / 09:00 PM IST

యువిక కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కలెక్టర్

KMR: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువికా కార్యక్రమానికి చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని రావుల నిహారిక ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్, విద్యార్థినిని, ఆమె గైడ్ టీచర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీ సిద్ధ రామిరెడ్డి కూడా పాల్గొన్నారు.

April 23, 2026 / 09:00 PM IST

యాదగిరిగుట్ట దేవస్థానం గురువారం ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,18,950, బ్రేక్ దర్శనాలతో రూ.98,400, VIP దర్శనాలతో రూ.1,50,900, ప్రసాద విక్రయాలతో రూ.5,19,010, కార్ పార్కింగ్‌తో రూ.3,48,500, వ్రతాలతో రూ.83,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,17,171 ఆదాయం వచ్చిందన్నారు.

April 23, 2026 / 09:00 PM IST

మే 11 నుంచి గృహ గణన: కలెక్టర్

SRPT: సూర్యాపేటలో జనగణన-2027కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ గణన చేపడతామని ఈరోజు కలెక్టర్ తేజస్ తెలిపారు. ప్రజలు ఏప్రిల్ 26 నుంచి మే 10లోపు https://se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు అనంతరం వచ్చే యూనిక్ కోడ్‌ను గణనాధికారికి చూపాలని సూచించారు.

April 23, 2026 / 09:00 PM IST

జనగణనకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్న జనగణనకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హరిత గురువారం తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి గణన చేపడతామన్నారు. సంక్షేమ పథకాలు జనాభా ఆధారంగా అమలవుతున్నందున ఖచ్చితమైన సమాచారం అవసరమని వివరించారు. sc.census.gov.in ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని పేర్కొన్నారు.

April 23, 2026 / 08:56 PM IST