ADB: తాంసి మండలం వడ్డడి మత్తడివాగు ప్రాజెక్టు వివరాలను మంగళవారం జెఈ హరీష్ వెల్లడించారు. ప్రాజెక్ట్ యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 275.450 మీటర్లకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 0.336 టీఎంసీలు కాగా గడిచిన 24 గంటల్లో ఇన్ ఫ్లో లేదని, ఔట్ ఫ్లో 80 క్యూసెక్కులుగా వివరించారు. కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు.
నల్గొండ: కనగల్ ఉన్నత పాఠశాలలో పురాతన నాగేంద్రుని రాతి విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. పాఠశాల్లో బాత్రూంల నిర్మాణం కోసం తవ్వకాలు నిర్వహిస్తుండగా ఈ విగ్రహం బయట పడిందన్నారు. ఈ విగ్రహం కాకతీయుల, రెడ్డి రాజుల పరిపాలనా కాలానికి చెందినదిగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కనగల్ వాగులో ఓ విగ్రహం కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.
NLG: జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ అభినందనలు తెలిపారు. నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమించిన జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు రవి గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
NLG: మామను కోడలు హతమార్చిన ఘటన డిండి మండలం గోనబోయినపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ గొడవల నేపథ్యంలో మామ బద్దె రాములు (65)ను పెద్దకోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయగా రాములు తల వెనుక భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య (40) మట్టి పెళ్ళలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని అన్నారు.
KMM: 10వ తరగతి వరకు తమతో కలిసి చదువుకొని అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు తోటి స్నేహితులు అండగా నిలిచారు. కామేపల్లి మండలం పండితాపురంకు చెందిన వీరయ్య, వెంకట్, ధనమ్మ కొమ్మినపల్లి హై స్కూల్ 1985- 86లో 10 తరగతి చదివారు. ముగ్గురు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మంగళవారం తమ వంతు సహాయంగా రూ.38 వేలు అందజేశారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు.
జనగామ: జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈఓ రమేష్, డీడబ్ల్యూవో ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
JGL: జిల్లాలో విధులు నిర్వర్తించి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన ఎస్ఐ రాజమౌళి కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా రూ.4 లక్షలు ఆర్థికసాయం సోమవారం అందించారు. 2012 బ్యాచ్కు చెందిన ఏపీ, టీజీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు కలిసి తోటి మిత్రుడు రాజమౌళి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారందరూ కలిసి రూ.4 లక్షలు పోగుచేసి అందించారు.
PDPL: రెండు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. క్వింటా పత్తి ధర రూ.7,170 పలికింది. సోమవారం మార్కెట్ రైతులు 13 వాహనాల్లో 77 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,170, కనిష్ఠంగా రూ.6,900 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం కంటే తాజాగా పత్తి ధర రూ.20 పెరిగింది.
KMM: జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ.పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 36,660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తామన్నారు.
JGL: కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం రోజున సరస్వతీమాత జన్మదినమైన వసంతపంచమిని పురస్కరించుకుని అర్చకులు గౌతం శర్మ, వినయ్ శర్మల నిర్వహణలో అమ్మ వారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం150 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసి పుస్తక పూజ, విజయ కంకణధారణ చేశారు. మచ్చ వాణీ వెంకటరమణ స్వామివారికి బంగారు కిరీటాన్ని అందించారు.
BDK: ఛత్తీస్గఢ్ నుంచి చర్లకు వస్తున్న ఓ కుటుంబం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. చర్ల సరిహద్దుల్లో టూ-వీలర్, టాటా మ్యాజిక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న భద్రాచలం ఎమ్మెల్యే క్షతగాత్రులను పరిశీలించి, తన సహాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యేను స్థానికులు ప్రశంసించారు.
BDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని కేవలం కార్పొరేట్ వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శరత్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు.
PDPL: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించడంపై కళాశాల కో-ఆర్డినేటర్ అబ్దుల్ షుకూర్ వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కళాశాలలోని వర్సిటీ అభ్యాసకుల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.