SRD: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని విమర్శించారు.
JN: జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన దూడల బాలసిద్దులు కృత్రిమ కాలు పెట్టడానికి డబ్బులు అవసరం పడగా, నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ మంత్రి కొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి రూ. 1,25,000 మంజూరు చేయించారు. వారి కుటుంబానికి కిరణ్ ఈరోజు LOC పత్రాన్ని అందజేశారు.
ADB: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
JN: స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి స్టేషన్ ఘణపూర్ మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి రూ.1 లక్షలను ఆలయ ప్రధాన అర్చకులు కలకోట రామానుజాచర్యులుకి విరాళంగా అందజేశారు.
KMR: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని డీఆర్డివో పిడి సురేందర్ అన్నారు. లింగంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్, పంచాయతీ అధికారులతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
KMR: తాడ్వాయి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య ఎంఆర్పీఎస్ సభకు డప్పులతో రావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరు డప్పులతో హైదరాబాద్ తరలి లక్ష డప్పుల మాదిగ గుండె చప్పుడు సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి బస్సులు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ముందు కృష్ణ మాదిగకు మద్దతు తెలిపాలి.
ADB: కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల మాణిక్యం కోరారు. ఆదివారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అభయారణ్యంలో భారీ వాహనాలను అనుమతించక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాత్రివేళల్లో లోకల్, నాన్ లోకల్ వాహనాలను కూడా అటవీ అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు.
KMR: గురుకుల పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు బిక్కనూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు పొందేందుకు ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ST, SC, BC మైనార్టీ గురుకులాలలో చదివే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
SRPT: గొర్రెల, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు(M) కాప్రాయిపల్లిలో చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLG జిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
NLG: చిట్యాల మండలంలోని వట్టిమర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం వట్టిమర్తి మాజీ సర్పంచ్ రాచమల్ల రామచంద్రం స్మారకార్థం విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు, ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు జిట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
KMM: దూరాజ్పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు.
JGL: మెట్ పల్లి మండలం మేడిపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాలను శనివారం మున్సిపల్ కమిషనర్ మోహన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైట్ మెనూ, వంటగది, స్టోర్ రూమ్స్, క్లాస్ రూమ్స్, వండిన అన్నం, కూరలను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్స్తో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ తదితరులున్నారు.
KNR: శంకరపట్నం మండలం మక్త శివారులో శనివారం సాయంత్రం బైక్ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారంకి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు, పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న మక్త గ్రామానికి చెందిన ఎలుకపల్లి నర్సమ్మను ఢీకొనడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో ఆసుపత్రికి తరలించారు.
BDK: గుండాల మండల కేంద్రంతో పాటు మామకన్ను గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యా చందన విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం స్థల సేకరణను శనివారం పరిశీలించారు. అనంతరం కాచనపల్లి, ముత్తాపురం, లింగగూడెం, రోళ్లగడ్డ, గుండాల గ్రామాల్లో నర్సరీలను సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, పాల్గొన్నారు.
SDPT: అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన బాకీ బిక్షపతి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా BRS సీనియర్ నాయకులు చింతల కుమార్, నాయకులు శనివారం బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు.