JN: స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి స్టేషన్ ఘణపూర్ మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి రూ.1 లక్షలను ఆలయ ప్రధాన అర్చకులు కలకోట రామానుజాచర్యులుకి విరాళంగా అందజేశారు.