ATP: ఉరవకొండ టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు అర్జీలను సమర్పించారు. మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.