అన్నమయ్య: మదనపల్లెలోని జడ్పీ హై స్కూల్లో గణిత శాస్త్ర ఉపాధ్యాయులైన ఒంటి కొండ చలపతి నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. గణిత శాస్త్రంలో విద్యార్థులకు సులువైన పద్ధతిలో అత్యుత్తమ బోధన చేస్తున్నందుకు తెలుగు వెలుగు వారు పురస్కారానికి ఎంపిక చేశారు. ఆదివారం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రం నందు ఆయనకు కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని అందజేశారు.