SKLM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 8 తేదీ వరకు ఆయా సోమవారాలలో నిర్వహించే గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తదుపరి గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.