పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. అనుమతి లేని 2 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆప్టికల్ దుకాణాలు కంటి పరీక్షలు నిర్వహించరాదన్నారు. వైద్యానికి సంబంధించిన అన్నింటికీ ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలిపారు.