RR: మాడ్గుల మండలం అవురుపల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి నిధులు కేటాయించాలని MLA కసిరెడ్డి నారాయణరెడ్డికి మంగళవారం గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో 24 గంటల కరెంటు ఉండడం లేదని, అంతర్గత సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు.