WGL: GWMC 19వ డివిజన్ పరిధిలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వీధిలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంబోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు నల్ల సతీష్- ఉమ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.