NLG: తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఇవాళ చిట్యాల భవాని కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు తాడూరి చంద్రం, అధ్యక్షులు ఆరూరి సత్తయ్య, సలహాదారులు ఆరూరి శ్రీను, చంద్రశేఖర్, నరసింహ, శ్రీరాములు, బాలకృష్ణ, గిరి పాల్గొన్నారు.