NLG: చిట్యాల పట్టణంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు దుకాణ సముదాయాలను సందర్శించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎండి.అక్బర్ మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. విరాళాలు అందించి సహకరించాలన్నారు.