HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి వీధిలోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.