JN: దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నానునాయక్ తన భార్య దస్లీ జ్ఞాపకార్థం అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం భార్య మరణించడంతో ఆమె విగ్రహాన్ని తన వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేశారు. అలాగే తాను కూడా ఎప్పటికైనా ఆమెతో కలుస్తాననే భావనతో బతికుండగానే భర్త తన విగ్రహాన్ని ఆమె పక్కనే తయారు చేయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.