SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రూ.394 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన మంత్రి, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.