KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువులో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విప్లవ సింహాలు సాంఘిక నాటికను ప్రదర్శించనున్నారు. శ్రీ నవ్య నాట్యమండలి కళాకారులచే ఈ ప్రదర్శన ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నాటికను ప్రదర్శించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వహకులు కోరారు.