GDWL: జిల్లా పాల ఉత్పత్తిదారుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఏ. వెంకటస్వామి, అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్ద పరుషరాముడు ఎంపికయ్యారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఈ సంఘం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.