MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఆదివారం ఆయన కిష్టాపూర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాలను సందర్శించి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన ఆదేశించారు.