MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో సోమవారం అంగడి వేలం పాట నిర్వహించారు. ఈ క్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ సోమ రజిని స్థానంలో ఆమె భర్త సోమ రాజశేఖర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎవరనేది తెలియని పరిస్థితిలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరి.