ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్షయ నిర్మూలన లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిక్షయ్ మిత్ర పథకం ద్వారా దాతలు బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందిస్తున్నారు. ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద నెలకు రూ.500 ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.