SRPT: చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు వెళ్లే మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి గుట్ట సమీపంలో ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం ఆరబోయడంతో సోమవారం రాత్రి ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వరి కోతల నేపథ్యంలో రైతులు రోడ్లపై కాకుండా ఇతర ప్రదేశాల్లో ధాన్యం ఆరబోయాలని వాహనదారులు విన్నవిస్తున్నారు.