CTR:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్, కార్యదర్శి చిన రాములు ఐఏఎస్లను జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గాల సమస్యలు మరియు వారి అభివృద్ధిపై చర్చించారు. ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్డైరెక్టర్ బాబు పాల్గొన్నారు.