KMR: జిల్లా మద్నూర్ మండలానికి చెందిన ఇద్దరికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షతో పాటు జరిమానాను సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చంద్రకళ విధించినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. చిన్న శక్కర్గ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ (41), రుసేగావ్ గ్రామానికి చెందిన క్యాతంవార్ వెంకట్ (42)కు ఒకొక్కరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారన్నారు.