NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని 7 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం జరిగిన గణితం, రాజనీతి, వృక్షశాస్త్రం పరీక్షలకు మొత్తం 1,867 మందికి గాను 1,796 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71 మంది గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ రామ్ రెడ్డి తెలిపారు.