NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన సామల ఎర్రయ్య (56) కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా కాలు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.