NLG: నిడమనూరు మండం ఎర్రబెల్లి సమీపంలోని గుట్టపై కొలువైన లింగమంతుల స్వామికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పార్వతీదేవిని వివాహమాడేందుకు శివుడు ఇక్కడ స్వామి రూపంలో వెలిశాడని భక్తుల నమ్మకం. చెంచు వనిత అయిన మాణిక్యాలదేవిని పెళ్లాడేందుకు స్వామి మాయోపాయంతో ఆమెను ఒప్పించి కళ్యాణం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఏటా ఈ కొండ వద్ద జాతర నిర్వహిస్తున్నారు.