MNCL: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా మహిళలు తమ హక్కులపై చట్టసభల్లో గళం విప్పే అవకాశం ఉంటుందని తెలిపారు.