VKB: పరిగిలోని 11వ వార్డులో అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా కౌన్సిలర్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పర్యటించిన కౌన్సిలర్ ఎండీ అజాజ్ ఆయన మురుగునీరు నిల్వ, నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సహాయంతో నాలాలను శుభ్రపరిచి చెత్తను తొలగించే పనులు చేపట్టించారు.