NRPT: నారాయణపేట జిల్లా భూనీడ్ గ్రామంలో అరబిందో హెల్త్ కేర్ లిమిటెడ్ సహకారంతో శనివారం త్రాగునీటి శుద్ధి కేంద్రం RO ప్లాంట్ను ఎంపీ డీకే అరుణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో భూనీడ్లో త్రాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. దీనిని శుభ్రంగా కాపాడుకోవాలని కోరారు.