WNP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోగులను క్షేమంగా బయటకు తరలించే విధానం, మంటలను అదుపు చేసే జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్టీఓ బంగారయ్య, ఫైర్ స్టేషన్ అధికారి నరసింహారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.