WGL: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ మెంబర్ వరద రాజేశ్వర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన సందర్బంగా వేం నరేందర్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.