అన్నమయ్య: మదనపల్లిలో రహదారి భద్రతపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు 232 కీలక ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 50 చోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రదేశాల్లో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలో 19 బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటిలో 14 చోట్ల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.