కోనసీమ: ధాన్యం సేకరణలో జాప్యం జరిగినా, రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ నిధియాదేవి హెచ్చరించారు. శనివారం ఆమె ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి-1 రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం పరికరాల ద్వారా పరిశీలించి రికార్డులు సమీక్షించారు.