KDP: రాబోయే వర్షా కాలంలో బద్వేల్లో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచనల మేరకు పట్టణంలోని ప్రధాన కాలువలు శుభ్రపరిచే పనులను మున్సిపల్ సిబ్బంది శనివారం ప్రారంభించారు. కాలువల్లో పూడికను తొలగించి వర్షపునీరు సజావుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.