TPT: తిరుపతి జిల్లాలో జలధార–జలహారతి పథకం కింద చేపడుతున్న పనులతో పుత్తూరు మండలంలో నీటి సంరక్షణకు ఊతమిస్తోంది. కాలువల పూడికతీత, చెరువుల పునరుద్ధరణతో సుమారు 300 ఎకరాల గిరిజన భూములకు సాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి హామీ కింద గిరిజనులకు రోజుకు రూ.300 వేతనం లభిస్తూ ఆదాయం కలుగుతోంది. ఈ పనులతో నీటి వనరులు పెరిగి రైతులకు లాభం చేకూరుతుందన్నారు.