KDP: నేడు MLA మాధవి రెడ్డి, TDP నేత శ్రీనివాస రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 06:00 గంటలకు కలెక్టరేట్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు జరిగే 5K అవగాహన రన్లో పాల్గొంటారు. ఉదయం 10:00 గంటలకు ఏషియన్ జనని హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12:00 గంటలకు ఆచార్ల కాలనీలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.